జర్నలిస్ట్​ మునీర్ సేవలు వెలకట్టలేనివి : చింత అభినయ్

జర్నలిస్ట్​ మునీర్ సేవలు వెలకట్టలేనివి : చింత అభినయ్

లక్సెట్టిపేట, వెలుగు: ఎండీ మునీర్ జర్నలిజానికి చేసిన సేవలు వెలకట్టలేనివని లక్సెట్టిపేట సర్కిల్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు చింత అభినయ్ అన్నారు. ఆదివారం స్థానిక ఆర్ అండ్ బీ విశ్రాంత భవనం ఆవరణలో ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో మునీర్ సంతాప సభ ఏర్పాటు చేశారు. 

మునీర్ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అభినయ్ మాట్లాడుతూ.. జర్నలిజం మీద ప్రేమతో సింగరేణి సంస్థలో వాలంటరీ రిటైర్​మెంట్ తీసుకొని జర్నలిస్టుగా ప్రయాణాన్ని కొనసాగించారని, తెలంగాణ ఉద్యమం సమయంలో సింగరేణి ప్రాంతంలో క్రియాశీల పాత్ర పోషించారని కొనియాడారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లు వై.శ్రీనివాస్, గడ్డం వినీత్, మెట్టు మనోజ్, శ్రీనివాస్ గౌడ్, పేరం రమేశ్, అప్పని ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.