- మెడికల్ బిల్లులు జీతంలో కట్ చేస్తున్రు
- ఆందోళనలో సింగరేణి కార్మికులు
- ఎంప్లాయీస్పై రెఫర్ కేసుల
- ట్రీట్మెంట్ భారం
- ఏడాది క్రితం వాటికీ ఇప్పుడు కోతలు
మందమర్రి, వెలుగు: -మందమర్రి ఏరియాలోని ఒక డిపార్ట్మెంట్లో పనిచేసే ఎంప్లాయ్తండ్రి గత ఏడాది కరోనా బారినపడితే ఆయనను హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్కు సింగరేణి హాస్పిటల్ డాక్టర్లు రెఫర్చేశారు. ఇప్పుడు అడిషనల్మెడికల్ బిల్లుల పేరిట యాజమాన్యం ఆ ఎంప్లాయీ శాలరీ నుంచి రూ.6,736 కోత విధించింది. మందమర్రి ఏరియా వర్క్షాప్లో పనిచేసే కార్మికుడు మూడేండ్ల కిందట రోడ్యాక్సిడెంట్కు గురవడంతో కార్పొరేట్హాస్పిటల్కు రెఫర్ చేశారు. ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న ఆ ఎంప్లాయీకి అడిషనల్మెడికల్ బిల్లుల పేరిట జీతంలో రూ.12,353 కట్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా పలువురు ఎంప్లాయీస్ వేతనాల నుంచి అడిషనల్ మెడికల్ బిల్లులంటూ కోత విధించడం కలకలం రేపుతోంది. సింగరేణి ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులను ట్రీట్మెంట్ కోసం కార్పొరేట్హాస్పిటల్కు రెఫర్ చేసి.. ఇప్పుడు వేతనాల్లో కోత విధించడాన్ని ఎంప్లాయీస్ తప్పు పడుతున్నారు. ట్రీట్మెంట్టైంలో సరైన ఇన్ఫర్మేషన్ఇవ్వలేదని, ప్రస్తుతం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జీతంలో కోత విధించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఒక్కో కార్మికుడి దగ్గర రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు అడిషనల్ మెడికల్ బిల్లుల పేరుతో కటింగ్చేస్తున్నారని కార్మిక సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఏడాది క్రితం కేసులకు..
సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఫ్రీ మెడికల్ఫెసిలిటీస్కల్పించాల్సి ఉంది. ఖర్చు ఎంతైనా సింగరేణి యాజమాన్యం భరించాల్సిందే. నవంబర్లో చత్తీస్గఢ్లోని బొగ్గు గని కార్మికుడి కూతురు ట్రీట్మెంట్కు కోలిండియా యాజమాన్యం ఏకంగా రూ.16 కోట్లు అందించింది. అయితే సింగరేణిలో మాత్రం ఫ్రీ మెడికల్ట్రీట్మెంట్విషయంలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో ఏటా దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సింగరేణి చెబుతోంది. అలాంటిది కొత్తగా అడిషనల్మెడికల్ బిల్లులంటూ ఉద్యోగుల జీతాల్లో కటింగ్ పెడుతున్నారు. రోగిని రెఫర్చేసినప్పుడు కార్పొరేట్హాస్పిటల్ఖర్చు గురించి సింగరేణికి ముందే చెబుతుందని, శాంక్షన్పొందిన తర్వాతే ట్రీట్మెంట్ షురూ చేస్తుందని కార్మికులు పేర్కొంటున్నారు. ఏడాది అంతకన్నా ముందు ట్రీట్మెంట్ పొందినవారికి ఇప్పుడు బిల్లులు రావడమేంటని ప్రశ్నిస్తున్నారు.
అంతంతగానే వైద్యం
నెలకు వందల సంఖ్యలో రోగులను కార్పొరేట్ఆసుపత్రులకు రెఫర్చేయడం సింగరేణిలో ఒక తంతుగా మారింది. ఎక్కువగా సరైన సౌలత్లు లేని ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారు. లీడర్లు, ఆఫీసర్లతో పైరవీలు చేస్తే తప్ప రోగికి అనుకూలమైన హాస్పిటల్కు పంపడం లేదు. కంపెనీ నుంచి రూ. లక్షల్లో బిల్లులు దండుకుంటున్న కార్పొరేట్హాస్పిటల్స్ఎంప్లాయీస్, వారి కుటుంబాలను జనరల్వార్డుల్లోనే ఉంచుతున్న ఘటనలున్నాయి. కనీస ప్రత్యేకతను కూడా చూపడంలేదు. నిమ్స్ టారీఫ్ ప్రకారం ట్రీట్మెంట్ బిల్లులు చెల్లిస్తామనడంతో అర్హత లేని ఆస్పత్రులన్నీ సింగరేణితో అగ్రిమెంట్ చేసుకునేందుకు ముందుకొస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. చాలామంది చికిత్స కోసం రెఫర్ చేసిన కార్పొరేట్ఆసుపత్రికి వెళ్లి వచ్చి మళ్లీ సొంతంగా పేరున్న హాస్పిటల్లో అవుట్ పేషెంట్లుగా ట్రీట్మెంట్పొందుతున్నారు.
నోటీసు ఇవ్వకుండా కటింగ్లు వద్దు
సింగరేణి కార్మికులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అడిషనల్ మెడికల్ బిల్లుల చెల్లింపు పేర వేతనాల్లో కోత విధించవద్దు. జాయింట్ బైపార్టెడ్కమిటీ ఫర్ కోల్ ఇండస్ట్రీ (జేబీసీసీఐ) అగ్రిమెంట్ప్రకారం ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు ఎంత ఖర్చైనా సింగరేణి యాజమాన్యం భరించి ఫ్రీ ట్రీట్మెంట్అందించాలె. బిల్లుల వసూలు అగ్రిమెంట్కు విరుద్ధం.
- వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ నేత