
హైదరాబాద్, వెలుగు : ఆర్టీఐ కమిషనర్గా మరొకరిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. గవర్నర్ ఆమోదం మేరకు మెర్ల వైష్ణవిని నియమిస్తూ సీఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటు నలుగురు సమాచార కమిషనర్లను ప్రభుత్వం నియమించింది.
కప్పర హరిప్రసాద్, రాములు పేర్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి.