
- మంత్రి జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల, వెలుగు: చిన్నంబావి మండలం పరిధిలోని గూడెం, బెక్కేం గ్రామాల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ, అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులను అవమానించి రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగ హక్కులను కాపాడటం కోసం రాహుల్ గాంధీ రాజ్యాంగ సంరక్షణ యాత్ర చేపట్టారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కల్యాణ్ రావు, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ కృష్ణ ప్రసాద్ యాదవ్, మాజీ సర్పంచులు. మాజీ ఎంపీటీసీలు, మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.