ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా : వాకిటి శ్రీహరి

ప్రజల అభివృద్ధికి కృషి చేస్తా : వాకిటి శ్రీహరి
  • మంత్రి వాకిటి శ్రీహరి 

జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు ప్లై ఓవర్​ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డితో పాటు  నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  రాహుల్​గాంధీ ఆలోచనలను సీఎం రేవంత్​రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తానన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం సంతోషకరమన్నారు.