
- మంత్రి వాకిటి శ్రీహరి
జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారి జిల్లాకు వచ్చిన ఆయనకు ప్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్గాంధీ ఆలోచనలను సీఎం రేవంత్రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యతను క్రమశిక్షణతో నెరవేరుస్తానన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో తనకు మంత్రి పదవి ఇవ్వాలని కోరడం సంతోషకరమన్నారు.