
- అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్ఠికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని పెరిక భవన్లో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఎగ్ బిర్యానీ పంపిణీని ప్రారంభించారు.
పిల్లలకు తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని, ఆ తరువాత గవర్నమెంట్ స్కూల్ కు పంపాలని సూచించారు. అనంతరం పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. కార్యక్రమంలో సీడీపీవో లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, సూపర్వైజర్ కమల, అమృత, సువర్ణ, రాజేంద్ర, స్వర్ణలత, సునీత పాల్గొన్నారు.