కిషన్ జీ.. నన్నెందుకు ఇబ్బందిపెడ్తున్నరు? : ఎమ్మెల్యే రాజాసింగ్

కిషన్ జీ.. నన్నెందుకు ఇబ్బందిపెడ్తున్నరు? : ఎమ్మెల్యే రాజాసింగ్
  • అలా చేస్తే మీకేం లాభం?: ఎమ్మెల్యే రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో ఎలా గెలవాలో ఆలోచించాల్సింది పోయి.. తనను ఇబ్బంది పెట్టుడేందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ‘‘నన్ను ఇబ్బంది పెడితే మీకేం లాభం? నన్ను టార్గెట్ చేసి ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు?’’అని ఆయన అన్నారు. రెండ్రోజుల కింద రాజాసింగ్​ను ఉద్దేశిస్తూ కిషన్ రెడ్డి కామెంట్లు చేశారు. వాటిపై మంగళవారం రాజాసింగ్ స్పందించారు. ‘‘నేను పార్టీ ఐక్యత కోసం నిస్వార్థంగా పని చేస్తున్నాను.

 పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. లక్షలాది మంది మనోబలం దెబ్బతింటున్నది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉన్నది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కొంత టైమ్ ఇవ్వాలి. నేను, కొందరు పార్టీ నేతలు కలిసి సమస్యలు వివరిస్తాం. అప్పుడే పరస్పరంగా నమ్మకం, స్పష్టత ఏర్పడుతుంది. ’’అని రాజాసింగ్ అన్నారు.