
- పెబ్బేరు మండలానికి 504 ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు
- ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
పెబ్బేరు, వెలుగు: ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులను అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఎవరైనా డబ్బులు అడిగితే తన దృష్టికి తీసుకురావాలని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మేఘా రెడ్డి హెచ్చరించారు. గురువారం సాయంత్రం పెబ్బేరు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో 504 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టణంలోని ఓ లబ్ధిదారుడు ఇంటి వద్ద భూమి పూజ చేసి, ముగ్గు పోసి ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలోనే 504 ఇందిరమ్మ ఇళ్లకు పట్టాలు ఇచ్చానని అన్నారు.
రూ. 25.20 కోట్లు కేటాయించి పట్టాలు పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, హౌసింగ్ పీడీ విటోబా, ఏంఎంసీ చైర్ పర్సన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రవీంద్ర, ఎంపీవో రోజా రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, వెంకట్రాములు, రంజిత్ కుమార్, దయాకర్ రెడ్డి, రమణ, వెంకటేష్, అక్కమ్మ, భానుప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.