మిత్తీలు కడుతూనే పథకాల అమలు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మిత్తీలు కడుతూనే పథకాల అమలు : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
  • మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పదేళ్లలో బీఆర్​ఎస్​ చేసిన అప్పులకు మిత్తీలు కడుతూనే కాంగ్రెస్​ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అమలుచేస్తోందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం కోడూరు గ్రామంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తూ ముందుకెళ్తోందన్నారు. 

పేదోడి సొంతింటి కల కాంగ్రెస్​ హయాంలో నెరవేరుతోందన్నారు. మహబూబ్ నగర్ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.