
హైదరాబాద్, వెలుగు: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్ఎస్) ఎగ్జామ్ దరఖాస్తును ఈ నెల14 వరకు పొడిగించినట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీవీ. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ bse.telangana.gov.inను సందర్శించాలని కోరారు.