
థమన్ కుమార్, శ్వేతా దొరతి లీడ్ రోల్స్లో కేఈ మురుగన్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘పార్క్’. ఇప్పటికే తమిళంలో విడుదలై సక్సెస్ను అందుకుంది.
తాజాగా ఈ సినిమా తెలుగు రైట్స్ని నిర్మాత పి శ్రీనివాస్ గౌడ్ సొంతం చేసుకున్నారు. దీప ఆర్ట్స్ బ్యానర్పై తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు.
మర్డర్ మిస్టరీ, పోలీస్ ఇన్వెస్టిగేషన్, హారర్ ఎలిమెంట్స్తో గ్రిప్పింగ్గా సాగింది ట్రైలర్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందనే నమ్మకం ఉందని కో ప్రొడ్యూసర్ పి హేమంత్ అన్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామన్నారు.