నాసిరకం భోజనం.. అంగన్వాడి సెంటర్ ముందు ఆందోళన

నాసిరకం భోజనం..  అంగన్వాడి సెంటర్ ముందు ఆందోళన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అశ్వారావుపేట నందమూరి నగర్ లోని అంగన్వాడి సెంటర్ ముందు ఆందోళన చేశారు చిన్నారుల తల్లిదండ్రులు. చిన్నారులకు దొడ్డు బియ్యంతో వండిన అన్నం పెడ్తున్నారని వారు ఆరోపించారు. కిచిడీలో పురుగులు వచ్చాయని ఫైరయ్యారు. కొన్ని రోజులుగా పిల్లలకు నాసిరకం భోజనం పెడ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పేరెంట్స్. అంగన్వాడీ టీచర్ పాలు, పప్పు, కోడిగుడ్లు లాంటి నిత్యావసర వస్తువులను బ్లాక్ లో అమ్ముకుంటున్నారని చెప్పారు.