ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండో రోజు విచారించనున్న ఈడీ

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను రెండో రోజు విచారించనున్న ఈడీ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డిలను ఈడీ  అధికారులు ఏప్రిల్ 18వ తేదీన కూడా  ప్రశ్నించనున్నారు. ఏప్రిల్ 17వ తేదీన కూడా ప్రవీణ్ కుమార్,రాజశేఖర్ రెడ్డిలను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఉదయం 11 గంటలకు సాయంత్రం 5 గంటల వరకు చంచల్ గూడ జైల్లో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను విచారించింది. వీరిద్దరి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇతర వివరాలపై ఈడీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రవీన్, రాజశేఖర్ రెడ్డిల బ్యాంకు ఖాతాల వివరాలను కూడా ఈడీ సేకరించింది. 

ప్రవీణ్ రాజశేఖర్పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వీరిద్దరిని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈడి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ప్రవీణ్, రాజశేఖర్ లను విచారించడానికి నాంపల్లి కోర్టు అనుమతించింది. అయితే నిందితులను వారి తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి నాంపల్లి కోర్టు ఆదేశించింది.