తెలంగాణలో కొత్త దందా.. గంజాయితో మిల్క్ షేక్

తెలంగాణలో కొత్త దందా..  గంజాయితో మిల్క్ షేక్

తెలంగాణలో కొత్త దందా మొదలైంది. గంజాయి సరికొత్త రూపం దాల్చుకుంది. గంజాయితో మిల్క్ షేక్..తయారు చేస్తున్నారు కేటుగాళ్లు. గంజాయిని పౌండర్ గా మార్చి, దానితో మిల్క్ షేక్ లు చేసి అమ్ముతున్నారు.  ఆరోగ్యానికి  మేలంటూ కొందరు పాలు, హార్లిక్స్, బూస్టులో కూడా మిక్స్ చేస్తున్నారని సమాచారం. ఈ మిల్క్ షేక్ తాగితే 7 గంటలు మత్తులోనే ఉండిపోతారు. హైదరాబాద్ లో గంజాయితో  మిల్క్ షేక్ ల దందా..రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్  జగద్గిరిగుట్టలో సైబరాబాద్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టారు. గంజాయి మిల్క్  షేక్ అమ్ముతున్న కిరాణ దుకాణం యజమానిని అరెస్ట్ చేశారు.