పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సీఎం గెహ్లాట్

పోస్ట్ కోవిడ్ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సీఎం గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే ఆరోగ్య సమస్యలే పోస్ట్ కోవిడ్ ఇబ్బందులు. వీరి సంఖ్య ఎక్కువ అవుతోంది.ఇప్పడు సీఎం గెహ్లాట్ సమస్య కూడా అదే. కరోనాకు గురైన గెహ్లాట్...వైరస్  నుంచి కోలుకున్న తర్వాత కూడా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. లేటెస్టుగా ఛాతీ నొప్పితో ఆయన ఆస్పత్రిలో చేరారు. నిన్న ఆయన ఛాతీ నొప్పికి గురికాగా..ఇవాళ(శుక్రవారం) ఆసుపత్రిలో చేరారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహిస్తామని డాక్టర్లు తెలిపారు.

మరోవైపు ఆస్పత్రి నుంచి అశోక్ గెహ్లాట్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ తో గురువారం నుంచి ఛాతీలో విపరీతమైన నొప్పిగా ఉందని ఆయన తెలిపారు. యాంజియోప్లాస్టీ నిర్వహించబోతున్నారని చెప్పారు. SMS ఆస్పత్రిలో దీన్ని నిర్వహించనున్నారని తెలిపారు. తాను బాగానే ఉన్నానని... త్వరలోనే ఆరోగ్యంతో బయటకు వస్తానని చెప్పారు.