బ్రేక్ డౌన్ అయిందని లారీని రోడ్డు పక్కన ఆపితే..

బ్రేక్ డౌన్ అయిందని లారీని రోడ్డు పక్కన ఆపితే..
  • ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి.. మరొకరికి గాయాలు

నిజామాబాద్ జిల్లా కిసాన్ నగర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని అంబులెన్స్ లో నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ అవడంతో  డ్రైవర్ రోడ్ పై నిలిపి ఉంచారు. ఇంతలో వేగంగా వస్తున్న కంటెయినర్.. ఆగిన లారీని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.   ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు.