
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ పర్మినెంట్ బిల్డింగ్ నిర్మాణం కోసం రూ.3.50 కోట్లు నిధులు మంజూరైనట్లు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
ఇప్పటికే వనపర్తి సెగ్మెంట్ కు రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ నిర్మాణానికి నిధులు మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. వనపర్తి జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లకు కొత్త హంగులతో నూతన భవన నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.