రూ. 22 లక్షలతో బ్యాంక్ క్యాషియర్ పరార్

రూ. 22 లక్షలతో బ్యాంక్ క్యాషియర్ పరార్

హైదరాబాద్: వనస్థలిపురం బ్రాంచ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా క్యాషియర్ డబ్బుతో పరారయ్యాడు. రూ. 22 లక్షల 53 వేలతో క్యాషియర్ ప్రవీణ్ పరారయ్యాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం డ్యూటీకి వచ్చిన ప్రవీణ్... కడుపు నొప్పికి ట్యాబ్లెట్ కోసం అని చీఫ్ మేనేజర్ కు చెప్పి, సాయంత్రం 4 గంటలకు బ్యాంకు నుంచి వెళ్లిపోయాడు. బ్యాంక్ క్లోజింగ్ టైమ్ వరకు కూడా ప్రవీణ్ రాకపోవడంతో అనుమానం వచ్చిన మేనేజర్... ప్రవీణ్ కు ఫోన్ చేయగా.. స్విచ్ ఫ్ అని వచ్చింది. దీంతో క్యాష్ కౌంటర్ కు వెళ్లి చూడగా 22 లక్షలు మాయమైనట్లు గుర్తించారు మేనేజర్. డబ్బుతో క్యాషియర్ పరారయ్యాడని తెలుసుకున్న మేనేజర్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు అధికారులు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.