రైలు ఎక్కుతుండగా చోరీ..60 లక్షల డైమండ్ నెక్లెస్తో జంప్

రైలు ఎక్కుతుండగా చోరీ..60 లక్షల డైమండ్ నెక్లెస్తో  జంప్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీ చోరీ జరిగింది. ఒకటో ప్లాట్ ఫాం నంబర్ దగ్గర రైలు ఎక్కుతుండగా ఓ వృద్దురాలి హ్యాండ్ బ్యాగ్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఆ బ్యాగ్ లో సుమారు 60 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ తో పాటు ఇతర ఆభరణాలు ఉన్నాయని వృద్దురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు   జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలో నమోదైన దృష్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.