హిల్ట్ పాలసీ గడువు 3 నెలలు పెంపు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హిల్ట్ పాలసీ గడువు 3 నెలలు పెంపు..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్​, వెలుగు: హైదరాబాద్​ ఇండస్ట్రియల్​ ల్యాండ్​ ట్రాన్స్​ఫర్మేషన్​ (హిల్ట్​) పాలసీ గడువును ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు నెలలు పొడిగిస్తూ గురువారం చీఫ్​ సెక్రటరీ సంజయ్​ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్​ 31 వరకు హిల్ట్​పాలసీ దరఖాస్తులకు ఆన్​లైన్​ పోర్టల్​ అందుబాటులో ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

జూన్​ 5 కన్నా ముందున్న ఎస్సార్వో రేట్లే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇచ్చిన పాలసీ షరతులు, ఆపరేషనల్​ గైడ్​లైన్స్​లో ఎలాంటి మార్పులుండవని తేల్చి చెప్పారు. జూన్​ 21న నిర్వహించిన రెవెన్యూ మొబిలైజేషన్​ కేబినెట్​ సబ్​కమిటీ మీటింగ్​లో పలువురు ఇండస్ట్రియలిస్టులు గడువు పెంచాలని కోరారు. జూన్​ 1 నుంచి జూన్​ 30 వరకు కేవలం నెల రోజులే పాలసీ సైట్​ను ఓపెన్​ చేసి పెట్టారని, గడువును డిసెంబర్​ వరకు పొడిగించాలని కోరారు. ఈ మేరకు అక్టోబర్​ వరకు గడువు పొడిగించారు.