శివబాలకృష్ణ బెయిల్ పిటీషన్ పై సోమవారం తీర్పు..

శివబాలకృష్ణ బెయిల్ పిటీషన్ పై సోమవారం తీర్పు..

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి ఏసీబి కోర్టు విచారణ జరిపింది. శివ బాలకృష్ణను ఏసీబీకి ఇచ్చిన 8 రోజులు కస్టడీ పూర్తయ్యిందని బెయిల్ మంజూరు చెయ్యాలని శివబాలకృష్ణ తరపు న్యాయవాది కోర్టును కోరారు. శివ బాలకృష్ణకు బెయిల్ మంజూరు చెయ్యొద్దని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఇరు వాదనలు విన్న ధర్మాసనం యిల్ పిటిషన్ పై వచ్చే సోమవారం తీర్పు ప్రకటించనుంది. 

 ఏసీబీ విచారణలో శివ బాలకృష్ణ గురించి సంచలన విషయాలు బయటపడ్డాయి. శివబాలకృష్ణ వద్ద రూ.250 కోట్లకు పైగా అక్రమ ఆస్తులు గుర్తించారు. 214 ఎకరాల భూమి, 29 ప్లాట్లు బినామీల పేర్లపై ఉన్నాయని అధికారులు గుర్తించారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్లాట్లు ఉన్నట్టు గుర్తించారు.