
హసన్ పర్తి, వెలుగు : హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం అనంతసాగర్ శివారులోని ఎస్ఆర్ యూనివర్సిటీ 3వ స్నాతకోత్సవ వేడుకలు ఈ నెల 6 న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ దీపక్ గార్గ్ తెలిపారు. మంగళవారం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం నిర్వహించే స్నాతకోత్సవంలో ఏపీ ప్రభుత్వ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గౌరవ సలహాదారు, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.జి.సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ఎం.ఎం.కీరవాణికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేస్తారని వివరించారు. సమావేశంలో ప్రొ. వైస్ ఛాన్సలర్ డా.వి.మహేశ్, రిజిస్ట్రార్ డా.ఆర్.అర్చనా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.