
- కర్నాటక క్రికెట్ బాడీ నన్ను ఆహ్వానించింది: సిద్ధరామయ్య
బెంగళూరు: ఆర్సీబీ విజయోత్సవం వేళ కర్నాటకలోని బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా రాష్ట్ర సర్కారుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కర్నాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఆ ఈవెంట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదని చెప్పారు. కర్నాటక క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) సభ్యులు ఆహ్వానిస్తేనే తాను ఆర్సీబీ ఈవెంట్కు వెళ్లానని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ కూడా హాజరవుతున్నారంటూ తనకు కేఎస్సీఏ సభ్యులు చెప్పారని సీఎం తెలిపారు. ‘‘కేఎస్సీఏ కార్యదర్శి, కోశాధికారి నా వద్దకు వచ్చి ఆర్సీబీ ఈవెంట్కు రావాలని కోరారు. ఈ వేడుకను మేం నిర్వహించలేదు. కేఎస్సీఏ ఆధ్వర్యంలోనే ఏర్పాట్లు జరిగాయి. గవర్నర్ కూడా వస్తున్నారని నాతో వారు చెప్పారు. నన్ను ఆహ్వానించిన తర్వాతే అక్కడికి వెళ్లాను. వాళ్ల ఆహ్వానం మేరకు వెళ్లడం తప్ప ఇంకేమీ తెల్వదు. అసలు స్టేడియం వద్దకు నన్ను ఆహ్వానించలేదు’’ అని సిద్ధరామయ్య వెల్లడించారు.