- యాక్సిడెంట్లో కానిస్టేబుల్ బ్రెయిన్డెడ్
- అవయవ దానానికి ఒప్పుకున్న ఫ్యామిలీ
- నిమ్స్లో సక్సెస్ఫుల్గా గుండె మార్పిడి ఆపరేషన్
- గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసిన పోలీసులు
బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ వీరబాబు హార్ట్ను మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి నిమ్స్కు 12 నిమిషాల్లో తరలించారు. పోలీసులు గ్రీన్చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ జామ్ లేకుండా చూశారు.
హైదరాబాద్, వెలుగు: యాక్సిడెంట్లో బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ వీరబాబు హార్ట్ను గ్రీన్ చానెల్ ద్వారా మలక్పేట్ యశోద హాస్పిటల్ నుంచి నిమ్స్కు 12 నిమిషాల్లో తరలించారు. యశోద హాస్పిటల్ నుంచి బుధవారం మధ్యాహ్నం 1:44 గంటలకు బయలుదేరిన ప్రత్యేక అంబులెన్స్.. 1:56 గంటలకు నిమ్స్కు చేరుకుంది. పోలీసులు గ్రీన్చానెల్ ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా కేవలం 12 నిమిషాల్లోనే గుండె నిమ్స్కు చేరింది. కొంత కాలంగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురుచూస్తున్న ఖమ్మం జిల్లా కుసుమంచి మండలానికి చెందిన హుస్సేన్కు నిమ్స్ కార్డియోథెరపీ సర్జన్ డాక్టర్ అమరేశ్వరి టీమ్ డాక్టర్లు సక్సెస్ఫుల్గా గుండె మార్పిడి ఆపరేషన్ చేశారు. హైదరాబాద్ కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వీరబాబు ఈనెల 12న బైక్పై ఖమ్మంలోని కుసుమంచికి వెళుతుండగా గొల్లగూడెం దగ్గర ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తరువాత మెరుగైన వైద్యం కోసం మలక్పేట్లోని యశోద ఆసుపత్రికి వీరబాబును తరలించారు. ట్రీట్మెంట్ ఇస్తున్న సమయంలో వీరబాబుకు బ్రెయిన్డెడ్ అయ్యిందని యశోద డాక్టర్లు మంగళవారం వెల్లడించారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ ప్రతినిధులు వీరబాబు కుటుంబసభ్యులను కలిసి అవయవ దానం చేయాలని విజ్ఞప్తి చేశారు. వీరబాబు బాడీ నుంచి ఆయన ఫ్యామిలీ అంగీకారంతో హార్ట్, లివర్, రెండు కిడ్నీలు, లంగ్స్, కార్నియాలు తీసుకున్నారు. కలెక్ట్ చేసిన ఆర్గాన్స్ను ఎనిమిది మందికి డొనేట్ చేయవచ్చని జీవన్దాన్ ట్రస్ట్ ఇన్చార్జి డాక్టర్ స్వర్ణలత తెలిపారు.