
పెనుబల్లి, వెలుగు : తెలంగాణ నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వీఎం బంజరు పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద బుధవారం వీఎం బంజరు ఎస్సై వెంకటేష్ వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా వెళ్తున్న డీసీఎం వ్యాన్ ను తనిఖీ చేశారు.
బియ్యం లోడ్కు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి నుంచి 100 క్వింటాళ్ల రేషన్ ను ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ పోర్ట్ కు తరలిస్తున్నట్లు విచారణ లో తేలింది. డీసీఎం వ్యాన్ ను, బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించి, డ్రైవర్ నర్రా సైదులుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.