- మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి బాధాకరం
- కేసులు పెడితే మనోభవాలు దెబ్బతింటాయి
- రెడ్డి జేఏసీకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు
- పేద రెడ్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి
- తెలంగాణ రెడ్డి జేఏసీ నేతల డిమాండ్
హైదరాబాద్: ఘట్కేసర్లో జరిగిన రెడ్డి గర్జన సభ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి పై దాడి జరగడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర రెడ్డి జేఏసి నాయకులు ప్రకటించారు. రెడ్డి సభలో జరిగిన ఉద్రిక్త పరిస్థితులు వూహించలేదని వారు పేర్కొన్నారు. రెడ్ల జేఏసీ నేతలు ఇవాళ సమావేశమై రెడ్డి గర్జన సభ నిర్వహణ కు ముందు... తర్వాత జరిగిన పూర్వ పరాల గురించి మీడియాకు వివరించారు. సభలో మంత్రి మల్లారెడ్డి రెడ్లు ఎదుర్కొంటున్న సామాజిక, ఇతర సమస్యల గురించి కాకుండా ప్రభుత్వ కార్యక్రమాల గురించి కొంచెం అతిగా చెప్పడం మూలంగానే కొంతమంది రెడ్లు కొందరు ఆగ్రహానికి లోనయ్యారని పేర్కొన్నారు.
దాడి చేసింది గూండాలు కాదని.. అంతా తమ రెడ్లే ఉన్నారని వారు తెలిపారు.
మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి బాధాకరం.. ఘటనపై కేసులు పెడితే తమ సామాజిక వర్గం మనోభవాలు దెబ్బతింటాయని.. కాబట్టి కేసులను పెట్టొద్దని వారు కోరారు. రెడ్డి జేఏసీకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. పేద రెడ్ల కోసం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి సమస్యలు తీర్చేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. పేద రెడ్ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలంగాణ రెడ్డి జేఏసీ నేతలు కోరారు. రెడ్ల సమస్యల కోసం మీటింగ్ ఏర్పాటు చేస్తే రాజకీయ సమావేశంగా మారడం బాధాకరమని.. రాజకీయ పార్టీలు రెడ్లను పావులాగ వాడుకోవడం మానుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
బూస్టర్ డోసుగా కార్బెవాక్స్ టీకా.. పర్మిషన్ ఇచ్చిన డీసీజీఐ
సివిల్స్ పాసయ్యానని సంతోషం.. అంతలోనే షాకింగ్ న్యూస్