కార్పొరేషన్ ఛైర్మెన్లను నియమిస్తూ ఉత్తర్వులు

కార్పొరేషన్ ఛైర్మెన్లను నియమిస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్: పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఆశావహులను సంతృప్తిపరిచే దిశలో సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యమకారులను ముఖ్యంగా పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినరల్ డెవలప్మెంట్ కార్పోరేషన్(NMDC)  ఛైర్మెన్ గా మన్నే క్రిశాంక్ ను నియమించారు. అలాగే మెడికల్ సర్వీసెస్, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్ గా ఎర్రోళ్ల శ్రీనివాస్, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మెన్ గా సాయి చంద్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.