తీర్మానం ప్రవేశపెట్టడంపైజాజుల శ్రీనివాస్ గౌడ్ హర్షం
హైదరాబాద్, వెలుగు: కులగణన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ కులాల లెక్కలకు భరోసా కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కులగణన తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా శుక్రవారం అసెంబ్లీలో ఆయన. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలను కలిసి కృతజ్ఞతలు చెప్పారు. శనివారం అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో బీసీ కులగణన సాధన విజయోత్సవాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. త్వరలో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీసీ కులాల విజయోత్సవ మహాసభను నిర్వహించి సీఎం, డిప్యూటీ సీఎం, బీసీ మంత్రులను సత్కరిస్తామన్నారు.