కార్ల వాడకం వల్లే ట్రాఫిక్​ సమస్య

 కార్ల వాడకం వల్లే ట్రాఫిక్​ సమస్య

హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో రోడ్లు విశాలంగానే ఉన్నాయని, కార్ల వాడకం వల్లే ట్రాఫిక్​సమస్య తలెత్తుతోందని అర్బన్​ట్రాన్స్​పోర్ట్​నిపుణుడు ప్రశాంత్​కుమార్​బాచు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  ట్రాఫిక్ సమస్యపై అడ్వకేట్​వలంటీర్స్​సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సిటీలో ట్రాఫిక్​సమస్య రోజు రోజుకూ పెరుగుతోందన్నారు. 

ప్రభుత్వాలు, కంపెనీలు కార్లు కొనేందుకు కల్పించే ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణమన్నారు. రోడ్లును విస్తరించడం, ఫ్లైఓవర్లు, మెట్రో రైలు​ప్రాజెక్టులు ట్రాఫిక్​సమస్యను తగ్గించలేవని పేర్కొన్నారు. ప్రజలు కార్ల వాడకాన్ని తగ్గించేలా పాలసీ తయారు చేయాలని సూచించారు. రోడ్లపై  సైకిళ్లు, ఫోర్​ వీలర్లకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్​ ట్రాన్స్​పోర్టేషన్​ మెరుగుపడుతుందని చెప్పారు.