
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో రోడ్లు విశాలంగానే ఉన్నాయని, కార్ల వాడకం వల్లే ట్రాఫిక్సమస్య తలెత్తుతోందని అర్బన్ట్రాన్స్పోర్ట్నిపుణుడు ప్రశాంత్కుమార్బాచు అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రాఫిక్ సమస్యపై అడ్వకేట్వలంటీర్స్సంఘం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సిటీలో ట్రాఫిక్సమస్య రోజు రోజుకూ పెరుగుతోందన్నారు.
ప్రభుత్వాలు, కంపెనీలు కార్లు కొనేందుకు కల్పించే ప్రోత్సాహకాలే దీనికి ప్రధాన కారణమన్నారు. రోడ్లును విస్తరించడం, ఫ్లైఓవర్లు, మెట్రో రైలుప్రాజెక్టులు ట్రాఫిక్సమస్యను తగ్గించలేవని పేర్కొన్నారు. ప్రజలు కార్ల వాడకాన్ని తగ్గించేలా పాలసీ తయారు చేయాలని సూచించారు. రోడ్లపై సైకిళ్లు, ఫోర్ వీలర్లకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయడం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ మెరుగుపడుతుందని చెప్పారు.