టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన

టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన

ఖమ్మం జిల్లా: తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామంలో అధికారపార్టీ నాయకులు రెచ్చిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అహంకారంతో రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకు చెందిన మండల  అధ్యక్షుడు భూమి తగాదాలో  మహిళలపై దాడి చేశారని స్థానికులు తెలిపారు. గ్రామానికి చెందిన నాగండ్ల ప్రసాదరావు, ఉపేందర్ లకు మధ్య కొంత కాలంగా ఇంటి స్థలాల పంపకాలపై గొడవలు జరుగుతున్నాయి. అయితే ఉపేందర్ తనకు వచ్చిన స్థలంలో ఇంటి పనులు చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో గ్రామ ఉప సర్పంచ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాషబోయిన వీరన్న అనే వ్యక్తి ప్రసాద్ రావు ఫిర్యాదుతో ఉపేందర్ పై దాడి చేశాడు. ఇదంతా వీడియో తీస్తున్న ఉపేందర్  కుమార్తె పై కూడా చేయి చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. అన్నదమ్ముల పంచాయతీలో తల దూర్చటమే కాకుండా మహిళల పై దాడి చేసిన అధికార పార్టీ నాయకుడి పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.