హైదరాబాద్: పీజీ ఈసెట్ షెడ్యూల్ ను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్ లైన్ పీజీఈసెట్ ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. అయితే వరుస సెలవులు నేపథ్యంలో ఇబ్బందులు రావడంతో ఈ ప్రక్రియ గడువును మరింత పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 25వ తేదీ వరకు ధ్రువపత్రాల అప్లోడ్ గడువును పొడిగించారు.
అలాగే వెబ్ ఆప్షన్లు ఈనెల 29, 30 తేదీల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. వచ్చే నెల అంటే నవంబరు 3వ తేదీన ఎంటెక్, ఎంఫార్మ్, ఎంఆర్క్ సీట్ల కేటాయింపులు.. నవంబరు 15 నుంచి ఎంటెక్, ఎంఫార్మా, ఎంఆర్క్ తరగతులు ప్రారంభం అవుతాయి.