- శంషాబాద్లోని హైమద్ నగర్లో ఘటన
- స్థానికులపై పీఎస్లో బాధిత యువకుల కంప్లయింట్
శంషాబాద్, వెలుగు: దొంగతనాలు చేస్తున్నారనే అనుమానంతో స్థానికులు ఇద్దరి యువకుల్ని పట్టుకొని చితక బాది గుండు కొట్టించారు. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పీఎస్ పరిధిలో జరిగింది. సోమవారం ఉదయం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి హైమద్ నగర్ కాలనీలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వాళ్లను దొంగలు అనుకున్న స్థానికులు పట్టుకొని చితక బాదారు. ఆ తర్వాత వారికి గుండు కొట్టించారు. దీంతో ఆ యువకులు ఎయిర్ పోర్టు పీఎస్లో కంప్లయింట్ చేశారు. కేసు ఫైల్ చేసిన పోలీసులు స్థానికుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు.
మరిన్ని వార్తల కోసం