దొంగలు అనుకొని ఇద్దరికి గుండు కొట్టించిన్రు

దొంగలు అనుకొని ఇద్దరికి గుండు కొట్టించిన్రు
  • శంషాబాద్​లోని హైమద్​ నగర్​లో ఘటన
  • స్థానికులపై పీఎస్​లో బాధిత యువకుల కంప్లయింట్​

శంషాబాద్, వెలుగు:  దొంగతనాలు చేస్తున్నారనే అనుమానంతో స్థానికులు ఇద్దరి యువకుల్ని పట్టుకొని చితక బాది  గుండు కొట్టించారు. ఈ ఘటన శంషాబాద్​ ఎయిర్​ పోర్ట్​ పీఎస్​ పరిధిలో  జరిగింది. సోమవారం ఉదయం శంషాబాద్​ మున్సిపాలిటీ పరిధి  హైమద్ నగర్ కాలనీలో ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా  తిరుగుతున్నారు.  వాళ్లను  దొంగలు అనుకున్న స్థానికులు పట్టుకొని చితక బాదారు.  ఆ తర్వాత వారికి గుండు కొట్టించారు.  దీంతో ఆ యువకులు ఎయిర్ పోర్టు పీఎస్​లో  కంప్లయింట్ చేశారు.  కేసు ఫైల్ చేసిన పోలీసులు స్థానికుల్లో కొందరిని  అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ
వింత వైరస్.. తైవాన్ జామ రైతులకు నష్టాలు
రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు