కేసీఆర్ ఉద్యోగులను, రైతులను మోసం చేస్తుండు

కేసీఆర్ ఉద్యోగులను, రైతులను మోసం చేస్తుండు

తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా. బంగారు తెలంగాణ చేస్తానని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా  కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. కరీంనగర్ లో  జైల్లో ఉన్న బండి సంజయ్ ను కలిసిన భగవంత్ ఖుబా... ఆ తర్వాత మాట్లాడారు. బండి సంజయ్ ను చాలా ఆరోగ్యంగా.. ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. కేసీఆర్.. బీజేపీ కార్యకర్తలను, ప్రజలను అణచి వేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడని అన్నారు.  దీక్ష చేస్తున్న వారి పట్ల పోలీసులు నిర్బంధంగా వ్యవహరించారని..వాటర్ కనాన్లు, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి అమానుషంగా ప్రవర్తించారని తెలిపారు.కేసులకు, బెదిరింపులకు బీజేపీ నేతలు, కార్యకర్తలు భయపడరని స్పష్టం చేశారు.

కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రజలను కాపాడతానని చెప్పి ఉద్యోగంలో చేరి.. రాజకీయవేత్తలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు భగవంత్ ఖుబా. ఉద్యోగులను, రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నాడని..బండి సంజయ్ మాత్రం ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసం పోరాటం చేసిండన్నారు. ఇకపై కూడా  సంజయ్ పోరాటం మరింతగా చేయనున్నారని..భవిష్యత్ లో తెలంగాణ లో బీజేపీ ఉద్యమం చేపట్టనుందని తెలిపారు.

మరిన్ని వార్తల కోసం..

తమిళనాడులో రేపటి నుంచి నైట్ కర్ఫ్యూ