పరిగి, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం పెంచేందుకు.. వికారాబాద్జిల్లా పరిగి మండలం సోండేపూర్తండాలో టీచర్గా పని చేస్తున్న విస్లావత్ధనుంజయ తన ఇద్దరు కుమారులను శుక్రవారం పరిగి ప్రభుత్వ నం.1 పాఠశాలలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్కారు బడుల్లో అనుభవజ్ఞులైన టీచర్లు ఉన్నారని, నాణ్యమైన విద్యనందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ పిలల్లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం హెచ్ఎం గోపాల్ఆయనను అభినందించారు.
