ములుగు/ కాశీబుగ్గ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. గ్రేటర్ వరంగల్లో కురిసిన వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా, ములుగు జిల్లాలో మోస్తారు వర్షం కురువగా అత్యధికంగా వెంకటాపూర్ మండలంలో 44..3మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
మల్లంపల్లి లో 42.8మి.మీ, లక్ష్మీదేవిపేటలో 34.5, ములుగులో 32.8మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ సందర్భంగా కలెక్టర్ బోర్ఖడే హేమంత్సహదేవరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు. విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
