హైదరాబాద్లోని సైబరాబాద్ కమిషనరేట్లోని మొయినాబాద్ పీఎస్ గ్రౌండ్స్లో సైబరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వద్ద 820 పాడుబడ్డ/క్లెయిమ్ చేయని వాహనాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వం వేలం వేసేందుకు కసరత్తులు చేస్తోంది. ఈ సందర్భంగా ఎవరికైనా, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయాలని కోరూతూ ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.
సైబరాబాద్ (మెట్రోపాలిటన్ ఏరియా) పోలీసు చట్టం, 2004లోని సెక్షన్లు 6 (2), 7, హైదరాబాద్ సిటీ పోలీసు చట్టంలోని 40, 41 సెక్షన్ల ప్రకారం ఈ వెహికిల్స్ ను బహిరంగ వేలంలో విక్రయించాలని అధికార యంత్రాంగం ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో ఈ వాహనాల్లో దేనిపైనైనా అభ్యంతరం లేదా ఇతర ఆసక్తి ఉన్న ఎవరైనా సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్కి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన 6 నెలలలోపు వాహనాన్ని క్లెయిమ్ చేసుకోవాలని, ఆ తర్వాత వాహనాలు వేలం వేయబడతాయని వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం సైబరాబాద్ పోలీసు అధికారిక వెబ్సైట్, www.cyberabadpolice.gov.in ను సందర్శించాలని సూచించింది.