అధిష్టానం ఆదేశిస్తే లోక్ సభకు పోటీ చేస్తా : జానారెడ్డి

అధిష్టానం ఆదేశిస్తే లోక్ సభకు పోటీ చేస్తా :  జానారెడ్డి

హైదరాబాద్: అధిష్టానం ఆదేశిస్తే తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ జానారెడ్డి అన్నారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి దంపతులు సీఎంకు పుష్ప గుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. 

ఆయన వెంట వేం నరేందర్ రెడ్డి, రోహిణ్ రెడ్డి తదితరులున్నారు. భేటీ అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొత్త సర్కారుకు సహకరించాలని రేవంత్ రెడ్డి కోరినట్టు చెప్పారు. ప్రజాభిమానం చూరగొనేలా పనిచేయాలని సూచించానని అన్నారు. ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ ఉండదని, సలహాలు, సూచనలు  కావాలంటే ఇస్తానని జానారెడ్డి మీడియాకు చెప్పారు. 

కేసీఆర్ కోలుకోవాలి

మాజీ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని జానారెడ్డి ఆకాంక్షించారు. ఆయన హాస్పిటల్ లో ఉండటం బాధాకరమని అన్నారు. తాను దవాఖానకు వెళ్లినప్పుడు కేసీఆర్ నిద్రలో ఉన్నారని, మాజీ మంత్రులు హరీశ్​ రావు, కేటీఆర్ ను కలిసి వచ్చానని జానారెడ్డి చెప్పారు. కేసీఆర్ కోలుకొని కొత్త ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆకాంక్షించారు.