సంబురంగా ఏరువాక

సంబురంగా ఏరువాక
  • వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యేక పూజలు  ఎడ్లను ముస్తాబు చేసి ప్రదర్శన చేసిన రైతులు

ఏరువాక పున్నమిని మహబూబ్​నగర్​, నారాయణపేట జిల్లాకు చెందిన రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి, పొలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ భూ తల్లికి నైవేద్యాలు సమర్పించి సిరుల పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు. 

మరికల్, ఊట్కూరు, మహబూబ్​నగర్​ రూరల్​, చిన్నచింతకుంట మండలాల్లో ఎడ్ల ప్రదర్శన నిర్వహించారు.  మరికల్, చిన్నచింతకుంట మండల కేంద్రాల్లో ఏరువాక తాడు తెంపేందుకు రైతులు పోటీ పడ్డారు.–మరికల్​/చిన్నచింతకుంట/ఊట్కూరు/మహబూబ్​నగర్​ రూరల్​