
- వ్యవసాయ పొలాల వద్ద ప్రత్యేక పూజలు ఎడ్లను ముస్తాబు చేసి ప్రదర్శన చేసిన రైతులు
ఏరువాక పున్నమిని మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాకు చెందిన రైతులు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి, పొలాల వద్దకు చేరుకున్నారు. అక్కడ భూ తల్లికి నైవేద్యాలు సమర్పించి సిరుల పంటలు పండాలని మొక్కులు చెల్లించుకున్నారు.
మరికల్, ఊట్కూరు, మహబూబ్నగర్ రూరల్, చిన్నచింతకుంట మండలాల్లో ఎడ్ల ప్రదర్శన నిర్వహించారు. మరికల్, చిన్నచింతకుంట మండల కేంద్రాల్లో ఏరువాక తాడు తెంపేందుకు రైతులు పోటీ పడ్డారు.–మరికల్/చిన్నచింతకుంట/ఊట్కూరు/మహబూబ్నగర్ రూరల్