రూ.400 కోట్ల ప్రజా ధనం వృధా

రూ.400 కోట్ల ప్రజా ధనం వృధా

ఖమ్మం: కేసీఆర్ తన సొంత ప్రచారం కోసం రూ.400 కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన యాత్ర 92వ రోజుకు చేరుకుంది. జిల్లాలోని  మధిర నియోజకవర్గంలో  షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... కేసీఆర్ ఇష్టమొచ్చినట్టుగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని, ప్రతి రూపాయికి లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణీకులపై భారం మోపుతున్నారంటూ టీఆర్ఎస్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల హామీలను విస్మరించారని... సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాలు, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ప్రశ్నించారు. కేసీఆర్ ను గద్దెదించి.. వైఎస్ఆర్ పాలన తీసుకురావడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని షర్మిల స్పష్టం చేశారు.