బీహార్‌‌, మహారాష్ట్రలో యాక్సిడెంట్స్..10 మంది దుర్మరణం

బీహార్‌‌, మహారాష్ట్రలో యాక్సిడెంట్స్..10 మంది దుర్మరణం
  • 34 మందికి గాయాలు

భాగల్‌‌పూర్/ నాసిక్ : బీహార్, మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ యాక్సిడెంట్లలో పది మంది మృతిచెందారు. మరో 34 మంది గాయాలపాలయ్యారు. బీహార్‌‌లో ఓ ట్రక్కు అదుపు తప్పి కారుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భాగల్‌‌పూర్‌‌లోని ఆమాపూర్ గ్రామానికి దగ్గర్లో హైవేపై సోమవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇనుప రాడ్ల లోడ్​తో వెళ్తున్న ట్రక్ టైర్ పేలిపోవడంతో అదుపుతప్పి కారుపై పడిపోయింది.  

మహారాష్ట్రలోని నాసిక్​లో నలుగురు..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా అహెర్ వస్తీకి దగ్గర మంగళవారం ఆ రాష్ట్ర ఆర్టీసీ బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారు. మరో 34 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో తొమ్మిది మంది పరిస్థితి క్రిటికల్​గా ఉందని పోలీసులు తెలిపారు.