సీఎం సభకు జనాన్ని తీసుకురావాలని ఎంఈఓలకు ఆదేశాలు

సీఎం సభకు జనాన్ని తీసుకురావాలని ఎంఈఓలకు ఆదేశాలు

ఈ నెల 16న హుజురాబాద్ లో జరిగే  సీఎం కేసీఆర్ బహిరంగ సభకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం జరగనున్న సభకు జనాన్ని సమీకరించే బాధ్యతను ఉన్నతాధికారులు విద్యాశాఖకు అప్పగించారు. దీనికి సంబంధించి మండలాలు, గ్రామాల నుంచి జనాన్ని తీసుకురావాలని కరీంనగర్ జిల్లా విద్యాధికారి మండల MEO లను ఆదేశించారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవం, సీఎం బహిరంగ సభ నిర్వహణకు సంబంధించి 10 మందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు DEO. గ్రామాల నుంచి జనం తరలింపుతో పాటు... సభను విజయవంతం చేసే అంశాలపై చర్చించేందుకు ఈ 10 మంది స్పెషల్ ఆఫీసర్లతో ఇవాళ మధ్యాహ్నం హుజురాబాద్ MPDO ఆఫీస్ లో మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. వీళ్లే కాకుండా  సభ నిర్వహణ, జనాన్ని తీసుకొచ్చేందుకు 150 మంది రూట్ ఆఫీసర్లను నియమించారు. వీరిలో గ్రామ పంచాయతీ సెక్రటరీలు, రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు. ఐతే సీఎం సభ కోసం విద్యాశాఖకు బాధ్యతలు అప్పగించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కరోనాతో విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. ఆన్ లైన్ క్లాసులతో విద్యార్థులు కుస్తీ పడుతున్నారు. ఇలాంటి టైమ్ లో ఎంఈఓలకు సీఎం సభ బాధ్యతలు, జన సమీకరణ కోసం విద్యాశాఖ అధికారులు నియమించడం ఏంటనే ప్రశ్నిస్తున్నారు విద్యావేత్తలు. సీఎం మీటింగ్ కు ప్రభుత్వ కార్యక్రమంగానే నిర్వహిస్తున్నా.... భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తుండడం చూస్తుంటే పొలిటికల్ మీటింగ్ తరహాలో ఉందని అంటున్నారు విద్యావేత్తలు.