కర్ణాటకలో భారీ వర్షం.. కాంపౌండ్ వాల్ కూలి పదేళ్ల బాలిక మృతి..

కర్ణాటకలో భారీ వర్షం.. కాంపౌండ్ వాల్ కూలి పదేళ్ల బాలిక మృతి..

కర్ణాటకను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.. కర్ణాటకలోని మంగళూరులో గురువారం ( మే 29 ) రాత్రి కురిసిన భారీ వర్షానికికాంపౌండ్ వాల్ కూలి.. పదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంగళూరులోని కనకరేలో  కురిసిన భారీ వర్షానికి ఇంటి కాంపౌండ్ గోడ కూలి పదేళ్ల బాలిక మృతి చెందింది. భారీ వర్షానికి ఇంటి వెనక గోడ కూలడంతో శిధిలాల కింద చిక్కుకొని తీవ్రంగా గాయపడింది చిన్నారి. 

చిన్నారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. చిన్నారి మరణంతో ఆమె కుటుంబం లో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శుక్రవారం ( మే 30 ) కర్ణాటక తీరప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు.  

కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా గోడ కూలి మూడేళ్ల బాలిక మరణించిన నాలుగు రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. గోకాక్ పట్టణంలోని మహాలింగేశ్వర్ కాలనీలో ఈ సంఘటన జరిగింది, కీర్తిల నాగేష్ పూజారి అనే చిన్నారి తన సోదరితో కలిసి నిద్రిస్తుండగా వారి ఇంటి వెనుక గోడ కూలిపోయింది. గోడ కూలి ఇద్దరు పిల్లలపై పడింది, కీర్తిల అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె నాలుగేళ్ల సోదరి గాయపడింది.

మే 19న కూడా బెంగళూరులో ఇలాంటి సంఘటనే జరిగింది. శశికళ అనే 35 ఏళ్ల మహిళ కాంపౌండ్ గోడ కూలి మరణించింది.రాత్రిపూట కురిసిన వర్షానికి గోడ కూలిపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. శశికళ తక్షణమే మరణించారు.