దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల పదేళ్లు పూర్తి

దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల పదేళ్లు పూర్తి

హైదరాబాద్ లోని దిల్‌సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో బాంబు పేలుళ్లలో మరణించిన వారికి స్థానికులు  నివాళులర్పించారు. 2013 ఫిబ్రవరి 21 సాయంత్రం 6.45 నిముషాలకు పేలుళ్ళు జరగగా.. ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు. వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడగా.. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు అప్పట్లో ఉరి శిక్ష ఖరారు చేసింది. కానీ ఆ శిక్షను ఎన్ఐఏ కోర్టు ఇంకా అమలు చేయకపోవడం గమనార్హం. దీంతో దోషులకు వెంటనే ఉరి శిక్ష అమలు చేయాలనీ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.