ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,056 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,54,011కి చేరింది. ఇందులో 18,659 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,28,484 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శ‌నివారం వైరస్ కారణంగా 14 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,868కు చేరుకుంది. ఏపీలో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 70, చిత్తూరులో 87, తూర్పు గోదావరిలో 139, గుంటూరులో 206, కడపలో 47, కృష్ణాలో 153, కర్నూలులో 27, నెల్లూరులో 30, ప్రకాశంలో 37, శ్రీకాకుళంలో 24, విశాఖపట్నంలో 57, విజయనగరంలో 25, పశ్చిమ గోదావరిలో 154 కేసులు నమోదయ్యాయి.