- వీరిపై రూ.3.29 కోట్ల రివార్డు : బస్తర్ ఐజీ సుందర్రాజ్
భద్రాచలం, వెలుగు: చత్తీస్గఢ్ రాష్ట్రంలో బుధవారం భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. జగదల్పూర్లో బస్తర్ఐజీ సుందర్రాజ్ సమక్షంలో 44 మంది మహిళా మావోలు సహా 108 మంది 101 ఆయుధాలు, కిలో బంగారం, రూ.3.61 కోట్లు అప్పగించారు. లొంగిపోయిన మావోయిస్టులపై రూ.3.29 కోట్ల రివార్డు ఉందని ఐజీ తెలిపారు. 2024 నుంచి ఈ నెల 9 వరకు మొత్తం 2,625 మంది లొంగిపోయారని చత్తీస్గఢ్డీజీపీ అరుణ్ దేవ్గౌతమ్ప్రకటించారు. డెడ్లైన్ లోపు మావోయిస్టులందరూ లొంగిపోవాలని సూచించారు. ముఖ్యులైన మావోల కదలికలకు సంబంధించి తమ వద్ద సమాచారం ఉందని, సరెండర్అయితే పునరావాసం కల్పిస్తామని పేర్కొన్నారు.
దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీవారే..
జగదల్పూర్లో సరెండర్అయిన వారందరూ బీజాపూర్, బస్తర్, కాంకేర్, నారాయణపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో విస్తరించిన దండకారణ్యం స్పెషల్జోనల్కమిటీలో వివిధ కేడర్లలో పని చేస్తున్నవారే. రాహుల్ తెల్లాం, పండ్రూ కొవ్వాసి, జిత్రూ ఓయాం, రామ్ధర్, మల్లేశ్, ముచ్కీ, ఏవోబీకి చెందిన కోసా మండావి వంటి కమాండర్లు లొంగిపోయారు. వీరి సరెండర్ తో బస్తర్ దండకారణ్యంలో నక్సల్స్ ప్రాబల్యం తగ్గినట్టేనని పోలీస్అధికారులు అంటున్నారు.
6 ఏకే-47లు, ఒక ఏకే-47 తార్, 10 ఇన్సాస్రైఫిల్స్, ఒక కార్బైన్, 5 ఎస్ఎల్ఆర్రైఫిల్స్, 7 ఎస్ఎల్ఆర్ లు, ఒక 62 ఎంఎం ఎల్ఎంజీ, రెండు 5.56 ఎంఎం ఇన్సాస్ఎల్ఎంజీ, ఒక 303 ఎంఎం ఎల్ఎంజీ, ఇరవై 303 రైఫిల్స్, ఇరవై ఐదు 12 బోర్ రైఫిల్స్, 11 బీజీఎల్లాంచర్స్, ఒక 51 ఎంఎం మోర్టార్, మూడు 315 బోర్ రైఫిల్స్, 13 బర్మార్ తుపాకులు, ఒక మెగా బీజీఎల్ను మావోలు తమకు అప్పగించారని తెలిపారు. 7 జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు.
ఒడిశాలో మరో 10 మంది..
ఒడిశా రాష్ట్రంలోని కందమాల్ జిల్లాలో బుధవారం10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. కలహండి, -కందమాల్, బౌద్,- నయాగర్(కేకేబీఎన్) డివిజన్కు చెందిన వారు10 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. వీరిపై రూ.1.15 కోట్ల రివార్డు ఉంది. సరెండర్అయిన వారిలో స్టేట్కమిటీ మెంబర్ సానూ పొట్టం అలియాస్ నీతూ ఒకరు. నక్సల్స్ ముక్త్ ఒడిశా కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసేలా ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
