హైదరాబాద్/కంటోన్మెంట్/ఎల్బీనగర్, వెలుగు: సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి మొత్తం 57 మంది అభ్యర్థులు 85 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, 11 మందికి సంబంధించిన నామినేషన్లు రిజెక్ట్అయ్యాయి. 46 మంది నామినేషన్లు ఆమోదం పొందాయి. అలాగే చేవెళ్ల ఎంపీ స్థానానికి మొత్తం 64 నామినేషన్లురాగా, 17 నామినేషన్లనుతిరస్కరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి శశాంక తెలిపారు. 47 నామినేషన్లు ఫైనల్చేసినట్లు తెలిపారు. స్క్రూటినీ తర్వాత ఎంత మంది బరిలో ఉంటారో తెలుస్తుంది. 29 వరకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఉంది. అదే రోజు సాయంత్రం 3 గంటల తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.
కంటోన్మెంట్లో 21 నామినేషన్లు ఆమోదం
సికింద్రాబాద్కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాని 24 నామినేషన్లు రాగా, 21 నామినేషన్లను ఆమోదించామని, మూడింటిని రిజెక్ట్ చేశామని కంటోన్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధుకర్ నాయక్ తెలిపారు. మొత్తం 24 మంది 50 సెట్లు దాఖలు చేయగా.. బీజేపీ అభ్యర్థి ఎం.ఎ. శ్రీనివాస్వేసిన రెండు నామినేషన్లను తిరస్కరించినట్లు స్పష్టం చేశారు. ఫాం–ఎ, ఫాం–బి సమర్పించకపోవడంతో రిజెక్ట్చేసినట్లు తెలిపారు. ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసిన బంగారి రాజు నామినేషన్లో పది మంది ప్రపోజల్స్అవసరం ఉండగా 9 మంది మాత్రమే ప్రపోజ్ చేయడంతో అతని నామినేషన్ను తిరస్కరించామని చెప్పారు. లయన్స్ఆఫ్డెమాక్రటిక్ పార్టీ తరపున నామినేషన్ వేసిన నాగినేని సరిత తన అఫిడవిట్లో సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో రిజెక్ట్ చేసినట్లు తెలిపారు. అలాగే మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్రెబల్గా రెండు నామినేషన్లు వేయగా అధికారులు రెండింటినీ రిజెక్ట్ చేశారు. సర్వే సత్యనారాయణ ఇండింపెండెంట్గా రెండు, కాంగ్రెస్ రెబల్గా రెండు మొత్తం నాలుగు సెట్ల నామినేషన్లు వేశారు. కాంగ్రెస్రెబల్గా వేసిన నామినేషన్లలలో సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా అధికారులు తిరస్కరించారు. ఇండిపెండెంట్గా వేసిన రెండు నామినేషన్లను ఆమోదించారు.