ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఏపీలో క‌రోనా కేసులు భారీగా త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో 61,050 కరోనా టెస్టులు చేయగా 1,392 పాజిటివ్ కేసులు నమోదు అయిన‌ట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,44,359 కి చేరుకుంది. అయితే ఇందులో 21,235 యాక్టివ్ కేసులుండగా 8,16,322 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,549 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనాతో కృష్ణాజిల్లాలో ఐదుగురు, కడపలో ఇద్దరు మృతి, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 6,802కి చేరుకుంది.