మధ్యప్రదేశ్లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో14 మంది మృతి చెందగా, 21 మంది గాయపడ్డారు. బిచియా పోలీస్ పోస్ట్ ఏరియా పరిధిలోని బర్జార్ ఘాట్లో వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో 6 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు.
స్థానికుల సమాచారంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం బేబీ షవర్కు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
ఈ ఘటనలో గాయపడిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆ రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. మరణించిన వారికి సీఎం సంతాపం ప్రకటించారు. ఈ దరువార్తను తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు