
పెద్దమందడి, వెలుగు : మండల పరిధిలోని చిలకటోనిపల్లి గ్రామంలో రిటైర్డ్ ఎస్పీ సర్వేశ్వర్ రెడ్డి మామిడి తోటలో 15 అడుగుల భారీ కొండచిలువను పట్టుకున్నారు. విషయం పెద్దమందడి ఎస్సై శివకుమార్ కు చెప్పగా కొత్తకోటలో ట్రాఫిక్ విభాగంలో పని చేస్తున్న చీర్ల కృష్ణసాగర్కు తెలిపారు. ఆయన గ్రామానికి చేరుకొని 15 అడుగులు, 30 కేజీ బరువు గల భారీ కొండచిలువను పట్టుకున్నారు. ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో వదిలివేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్నేక్స్ సొసైటీ సభ్యులు గోపాల్ యాదవ్, భాస్కర్, మహబూబ్ , మైనుద్దీన్, భాగ్యలక్ష్మి, పెంటన్న, పల్లవి, వనజ, ఫాతిమా పాల్గొన్నారు .