‘15 కేజీల ఘీ’ అంటే.. 15 కోట్లు: చంద్రశేఖర్

‘15 కేజీల ఘీ’ అంటే.. 15 కోట్లు: చంద్రశేఖర్

‘15 కేజీల ఘీ’ కోడ్ నేమ్ పేరుతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇచ్చిన సూచన మేరకు రూ. 15 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వద్ద ఇచ్చినట్లు సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించాడు. ‘‘నేను 2020 నాటి‘15 కేజీల ఘీ’కి సంబంధించిన ట్రైలర్ ను బహిర్గతం చేయబోతున్నాను. అందులో ‘ఘీ’ పేరుతో మీరు(కేజ్రీవాల్), సత్యేంద్ర జైన్ సూచనలు ఇచ్చారు. మీ తరఫున హైదరాబాద్​లోని బీఆర్ఎస్ ఆఫీసు వద్ద రూ. 15 కోట్లు డెలివరీ చేశాను. బీఆర్ఎస్ ఆఫీసులో పార్క్ చేసి ఉన్న రేంజ్ రోవర్ 6060 కారులో ప్రస్తుత లిక్కర్ స్కాం కేసు నిందితుల్లో ఒకరైన ‘ఏపీ’ అనే వ్యక్తికి ఆ డబ్బులు డెలివరీ చేశాను. ఈ 15 కిలోల నెయ్యి @ 15 కోట్ల రూపాయలను నేను హైదరాబాద్‌లో డెలివరీ చేయాలని మీరు కోరుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్‌లో ఇప్పటికే 5 కేసుల ఘీ.. అంటే రూ. 15x5 కోట్లు ఉన్నాయని మీరు చెప్పారు. ఇందులో రూ. 15 కోట్లు మీ తరఫున బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఆ వ్యక్తికి అందజేశాను’’ అని సుఖేశ్ వివరించాడు.